మైనర్ కుమార్తెలను అమ్మేసిన తండ్రి..

Father sells minor daughters for Rs 8 lakh. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాకు చెందిన ఓ తండ్రి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను అమ్మేశాడు

By Medi Samrat  Published on  1 Jan 2022 7:40 AM GMT
మైనర్ కుమార్తెలను అమ్మేసిన తండ్రి..

రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాకు చెందిన ఓ తండ్రి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను అమ్మేశాడు. రూ.8 లక్షలకు బేరం పెట్టినట్లు తెలియడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫూల్‌బరోడ్‌ నివాసి అయిన బద్రీలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చిప్పబరోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిసెంబరు 22న ఓ మైనర్ బాలిక తన తండ్రి డబ్బులు తీసుకుని తనకు, చెల్లెలికి పెళ్లి చేశాడని కేసు నమోదు చేసినట్లు బరన్ పోలీస్ సూపరింటెండెంట్ కళ్యాణమల్ మీనా తెలిపారు.

నవంబర్ 13న ఫూల్‌బరోడ్‌కు చెందిన బద్రి మీనా, వామన్‌పురానికి చెందిన సురేష్‌లు మారుతీ వ్యాన్‌ను ఇంటికి తీసుకొచ్చారు. అక్కాచెల్లెళ్లిద్దరినీ తమతో పాటు వ్యానులో ఎక్కించుకున్నారు. బద్రి బాలికను శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడు, సురేష్ మైనర్ బాలిక చెల్లెలిని తన ఇంటికి తీసుకెళ్లి బంధించాడు. మైనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రత దృష్ట్యా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీనా వెంటనే CO ఛబ్రా పూజా నగర్ పర్యవేక్షణలో పోలీసు అధికారి ఛద్బరోద్ రవీంద్ర సింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందం తక్షణమే చర్యలు చేపట్టి, అపహరణకు గురైన మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని, మైనర్ తండ్రి బద్రీలాల్ మీనాను అరెస్టు చేసింది. వీరితో పాటు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.


Next Story