ఐదు రాష్ట్రాల‌కు మోగిన ఎన్నిక‌ల న‌గారా..

EC Announces Assembly Election Schedule for 5 States. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును

By Medi Samrat  Published on  8 Jan 2022 11:17 AM GMT
ఐదు రాష్ట్రాల‌కు మోగిన ఎన్నిక‌ల న‌గారా..

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. చీఫ్‌ ఎన్నికల ఆఫీసర్‌ సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్‌ సేఫ్‌ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మాస్క్, థర్మల్ స్కానర్లు, శానిటేషన్ తదితర లాజిస్టిక్స్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాం. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలి. అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

తాజా నిర్ణయంతో ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎలక్షన్‌ అబ్జర్వర్లను నియమించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ.28లక్షలుగా ఉంది. డబుల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్‌ సోకిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ పార్టీలు జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.

జనవరి 14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. తొలి దశ పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి 10న నిర్వహించనున్నారు. రెండో దశ (పంజాబ్‌, గోవా,ఉత్తరాఖండ్‌, యూపీ) పోలింగ్‌ ఫిబ్రవరి -14న మొదలవ్వనుంది. ఒకే దశలో పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికలను పూర్తీ చేయనున్నారు. మూడో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -20న కాగా.. నాలుగో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -23.. ఐదో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -27.. మార్చి 3న ఆరో విడత ఎన్నికలు.. మార్చి 7న ఏడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న మణిపూర్‌ తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 3న మణిపూర్‌ రెండో విడత ఎన్నికలు కాగా.. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలవ్వనున్నాయి.


Next Story