3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!

శుక్రవారం ఉదయం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండా జిల్లాలో భూకంపం సంభవించింది.

By -  Medi Samrat
Published on : 6 Feb 2026 12:48 PM IST

3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!

శుక్రవారం ఉదయం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండా జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. భూకంపం ఉదయం 7:32:1 గంటలకు సంభవించింది. భూకంప‌ కేంద్రం ఇటియాథోక్ సమీపంలో 27.36 ఉత్తర అక్షాంశం మరియు 82.05 తూర్పు రేఖాంశం వద్ద దాదాపు 10 కి.మీ లోతులో ఉంది. భూకంపం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాజేష్ శ్రీవాస్తవ తెలిపారు.

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు అందలేదు. సంబంధిత విభాగాలు, స్థానిక పరిపాలనను అప్రమత్తం చేశామని, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి బృందాలను సిద్ధంగా ఉంచామని ఆయన చెప్పారు. ప్రజలు భయపడవద్దని లేదా పుకార్లను పట్టించుకోవద్దని కూడా కోరారు. ఏదైనా అసాధారణ పరిస్థితి లేదా నష్టాన్ని వెంటనే స్థానిక పరిపాలన లేదా విపత్తు నియంత్రణ కార్యాల‌యానికి నివేదించాలని వారిని కోరారు.

Next Story