Red Fort Blast : పేలుడు జ‌రిగిన‌ రహదారిపై రాక‌పోక‌లు ప్రారంభం

ఎర్రకోట పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజలకు తెరవబడింది.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 5:12 PM IST

Red Fort Blast : పేలుడు జ‌రిగిన‌ రహదారిపై రాక‌పోక‌లు ప్రారంభం

ఎర్రకోట పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజలకు తెరవబడింది. శనివారం ఉదయం నుంచి ఇక్కడి నుంచి వాహనాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించ‌డంతో పాత ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించింది.

10 నవంబర్ 2025 సాయంత్రం ఎర్రకోట సమీపంలో హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు చాలా బలంగా ఉండటంతో సమీపంలో గందరగోళం నెలకొంది. ఈ పేలుడులో పలువురు గాయపడగా మరికొందరు చనిపోయారు. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. సమీపంలోని రహదారులను మూసివేసింది. మెట్రో స్టేషన్ గేట్ల మరమ్మతు పనులు కూడా కొనసాగుతున్నాయి; ముఖ్యంగా గేట్ నంబర్ 1 అద్దాలు పగిలిపోయాయి.

ఎర్రకోట ఘటనాస్థలికి వెళ్లే మార్గం తెరవడంతో క్రమేపీ ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. వాహన యజమానులు నెమ్మదిగా రహదారి గుండా వెళుతుండటం కనిపించింది. ఆ ప్రాంతంలో సాధారణ ప్రజల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. పెళ్లి సామాగ్రిని సేకరించేందుకు కుటుంబ సమేతంగా వచ్చిన ప్రీతి.. పేలుడు జరిగిన సమయంలో తన మోటార్‌సైకిల్‌ను పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచారని, నవంబర్‌ 10 నుంచి అక్కడే పడి ఉందని చెప్పారు. ఇప్పుడు మార్గం తెరవ‌డంతో దానిని తీసుకోనున్న‌ట్లు తెలిపారు.

Next Story