కాంగ్రెస్ ఆరో జాబితా విడుద‌ల‌.. లోక్‌సభ స్పీకర్‌పై పోటీకి ఎవ‌రిని దింపిందంటే..

కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను

By Medi Samrat  Published on  25 March 2024 12:09 PM GMT
కాంగ్రెస్ ఆరో జాబితా విడుద‌ల‌.. లోక్‌సభ స్పీకర్‌పై పోటీకి ఎవ‌రిని దింపిందంటే..

కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగుతున్న ఓం బిర్లాపై పోటీ చేసేందుకు కోటా నుంచి ప్రహ్లాద్ గుంజాల్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది.

దీంతో ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 190 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి దామోదర్ గుర్జర్, తిరునల్వేలి నుంచి సీ రాబర్ట్ బ్రూస్ పోటీ చేయ‌నున్నారు.

జైపూర్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోటసార సమక్షంలో గుంజాల్ కాంగ్రెస్‌లో చేరారు.రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సన్నిహితుడైన గుంజాల్ గతంలో కోట నార్త్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయ‌న‌ చాలా మంచి వ‌క్త‌. అతని రాక హదోతి ప్రాంతంలో కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Next Story