కరోనా విజృంభణ.. సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం

Complete lockdown today due to rising number of Covid cases in tamilnadu. తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసులు అధికారులు

By అంజి  Published on  9 Jan 2022 6:10 AM GMT
కరోనా విజృంభణ.. సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం

తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసులు అధికారులు తెలిపారు. దీంతో శనివారం నాడు కూరగాయలు, మాంస మార్కెట్లకు జనం పోటెత్తారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 3 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని ఈ మేరకు పోలీసులు సూచిస్తున్నారు. శనివారం రాత్రి నుండి అన్ని చెక్‌పోస్టుల్లోనూ రోడ్లను మూసేశారు. ఈ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ గురువారం నుండి అమల్లోకి వచ్చింది. ఇక శనివారం నాడు 18వ విడతగా ఏర్పాటు చేసిన 50 వేల శిబిరాల్లో లక్షలాది మంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. 15 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.

అన్ని ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్ అమలు చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. డిసెంబర్ 27న తమిళనాడులో కోవిడ్ కేసులు 605 కాగా, జనవరి 3న 1,728కి చేరుకుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ప్రభుత్వం ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత చెన్నై రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోకుంటే వైరస్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరించడంతో ఆంక్షలు ప్రకటించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, అన్ని వాణిజ్య సంస్థలు, మాల్స్, దుకాణాలు మరియు రెస్టారెంట్లు అనుమతించబడిన సమయానికి మించి పనిచేయడానికి అనుమతించబడవు. కర్ఫ్యూ సమయంలో అనుమతించబడిన ముఖ్యమైన సేవలలో పాలు, వార్తాపత్రికలు, ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు, మెడికల్ షాపులు, అంబులెన్స్‌లు, శవవాహన సేవలు ఉన్నాయి.

Next Story