ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది

By Knakam Karthik
Published on : 17 Aug 2025 8:11 PM IST

National News, Delhi, Vice President candidate, CP Radhakrishnan, BJP

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ను NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన BJP పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకున్నారు.

ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, BJP జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖ నేతలు హాజరయ్యారు. అభ్యర్థి పేరును ప్రకటిస్తూ జె.పి. నడ్డా మాట్లాడుతూ, “దేశానికి సేవ చేయడంలో రాధాకృష్ణన్‌గారి అనుభవం, నిబద్ధత గొప్ప ఆస్తి. ఆయన ఉపరాష్ట్రపతిగా అత్యుత్తమ సేవలందిస్తారని NDA విశ్వసిస్తోంది” అని తెలిపారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9, 2025న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్ NDA తరపున పోటీ చేయనున్నారు. సి.పి. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ BJP నాయకుడు. ఆయన 1998, 1999లో కోయంబత్తూరులో నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2023లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.

Next Story