రాహుల్ ప్రాథమిక స్వభావమే భారత్ వ్యతిరేకం : బీజేపీ
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్థాన్ భారీ నష్టాన్ని చవిచూసింది.
By Medi Samrat
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్థాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. పాక్లోని 9 ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ పై దేశంలో రాజకీయాలు రాజుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిన్న ప్రశ్నలను లేవనెత్తారు,. దాడి గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎందుకు తెలియజేసారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీని వల్ల దేశ భద్రతకు నష్టం వాటిల్లిందని, ఈ దాడి గురించి శత్రు దేశానికి ముందే తెలుసని రాహుల్ అన్నారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ బదులిచ్చింది.
రాహుల్ ప్రాథమిక స్వభావమే భారత్ వ్యతిరేకమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి వల్ల దేశానికి ఒక్క రాఫెల్ కూడా రాలేదని, బీజేపీ ప్రభుత్వం రాఫెల్ను భారత్కు తీసుకొచ్చిందని అన్నారు. దేశ ప్రధానితో మీకు విభేదాలు ఉన్నా సరే అని రాహుల్ గాంధీని దేశం ప్రశ్నిస్తోంది. ప్రధానిపై పరుష పదజాలాన్ని ఉపయోగించడం.. మీ ప్రకటనలు పాకిస్తాన్ను సమర్థించడం, కాంగ్రెస్ నేతల ప్రకటనలను పాకిస్తాన్ పార్లమెంటు సమర్థించడం.. భారతదేశ పరువు తీయడం ఆందోళన కలిగిస్తుంది. రాహుల్ గాంధీ.. మీరు ఏ వైపు ఉన్నారో మీరే నిర్ణయించుకోండి..? మీరు భారతదేశ ప్రతిపక్ష నాయకులా లేదా పాకిస్తాన్ యొక్క నిషాన్-ఎ-పాకిస్తాన్నా? అని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్కు ముందు కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ రాఫెల్పై కార్టూన్ చూపించి ఎగతాళి చేశారని అన్నారు.