ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ జరిగింది.

By Knakam Karthik
Published on : 26 Jun 2025 11:00 AM IST

National News, Chhattisgarh, Maoists, Security Forces, Encounter

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్‌మడ్‌ అడవుల్లో ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్(స్టేట్ టాస్క్ ఫోర్స్) జాయింట్‌గా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.

ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య 8 గంటల పాటు భీకర ఎదరుకాల్పలు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మాడ్ డివిజన్‌లో క్రియాశీల సభ్యులుగా చెప్పబడుతున్న ఇద్దరు మహిళా నక్సలైట్లు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్పాట్‌లో రెండు మృతదేహాలు, ఒక ఇన్సాస్ రైఫిల్, 315 బోర్ గన్‌, విప్లవ సాహిత్యంతో పాటు మెడికల్ కిట్, భద్రతా బలగాల ట్రాప్‌నకు ఉపయోగించే ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా ఐజీ బస్తర్ పి.సుందర్రాజ్ వెల్లడించారు.

Next Story