మృతుల కుటుంబాలకు పరిహారం ప్ర‌క‌టించిన‌ ఎయిర్ ఇండియా

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర ఆర్థిక సాయం అందజేస్తామని ఎయిర్‌ ఇండియా శనివారం ప్రకటించింది.

By Medi Samrat
Published on : 14 Jun 2025 8:36 PM IST

మృతుల కుటుంబాలకు పరిహారం ప్ర‌క‌టించిన‌ ఎయిర్ ఇండియా

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర ఆర్థిక సాయం అందజేస్తామని ఎయిర్‌ ఇండియా శనివారం ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన కోటి రూపాయల పరిహారానికి ఈ మొత్తం అదనం. జూన్ 12 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి గురైంది. ఈ విమానం నివాస ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడింది.

ఈ ఘోర ప్రమాదంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171కి సంబంధించిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. ఈ సమయంలో మేము పడుతున్న బాధను మాటల్లో చెప్పలేము. మా ఆలోచనలు, ప్రార్థనలు ప్రియమైన వారిని కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలతో ఉంటాయి. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ ₹1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తుంది. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేము భరిస్తాము. వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందేలా చూస్తాము. మేము BJ మెడికల్ హాస్టల్ నిర్మాణంలో సహాయం అందిస్తాము. ఈ అనూహ్యమైన సమయాల్లో బాధిత కుటుంబాలు, సంఘాలకు మేము అండగా ఉంటామని 12వ తేదీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Next Story