మోదీ స‌హా ప‌లువురు బీజేపీ నేత‌ల‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. 54 మందిపై కేసు

54 Booked in Pune for ‘Objectionable’ Posts on PM Modi, Fadnavis. ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు

By Medi Samrat  Published on  12 May 2021 3:14 PM GMT
మోదీ స‌హా ప‌లువురు బీజేపీ నేత‌ల‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. 54 మందిపై కేసు

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పుణె సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు న‌మోద‌య్యింది. మోదీ స‌హా మ‌హ‌రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, పలువురు బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 54 మందిపై బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి , అడ్వకేట్‌ ప్రదీప్‌ గవాడే ఫిర్యాదు చేశారు.

మోదీతో పాటు మ‌హ‌రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆయన భార్య అమృతా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్ లపై ఆ 54 మంది అనుచిత వ్యాఖ్యలు పోస్ట్‌ చేసినట్టు గవాడే ఫిర్యాదు చేశారు. ఈ విష‌య‌మై సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ దగదు హేక్ మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీస్‌ బేరర్‌ వినీత్‌ బాజ్‌పాయ్‌ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో 54 మందిని నిందితులుగా చేర్చినట్లు వివరించారు




Next Story