Earthquake : అమరావతిలో భూకంపం

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 4.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది

By Medi Samrat
Published on : 30 Sept 2024 3:46 PM IST

Earthquake : అమరావతిలో భూకంపం

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 4.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు నివేదిక రాలేదని అమరావతి రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ అనిల్ భట్కర్ తెలిపారు. జిల్లాలో మధ్యాహ్నం 1.37 గంటలకు భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.

చికల్‌ధార, కట్‌కుంభ్‌, చుర్ని, పచ్‌డోంగ్రీ తాలూకాలు, మెల్‌ఘాట్‌ ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని పరట్వాడ నగరంలోని కొన్ని ప్రాంతాలు, అకోట్ ప్రాంతాల్లోని ధరణిలో కూడా ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.

Next Story