ఒకేసారి 40 మంది అరెస్ట్‌.. ఎందుకంటే..

40 'gamblers' held in Indore. మధ్యప్రదేశ్ పోలీసులు 40 మంది జూదరులను అదుపులోకి తీసుకుంది. వారితో పాటు రూ. 3లక్షల నగదును

By Medi Samrat  Published on  22 Nov 2020 4:16 AM GMT
ఒకేసారి 40 మంది అరెస్ట్‌.. ఎందుకంటే..

మధ్యప్రదేశ్ పోలీసులు 40 మంది జూదరులను అదుపులోకి తీసుకుంది. వారితో పాటు రూ. 3లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన ఇండోర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రైడ్‌లో నాలుగు పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఐజీ యోగేష్ దేశ్‌ముఖ్, డీఐజీ హరినారాయణ చారీ మిశ్రాల నాయకత్వంలో ఈ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేశారు.

ఈ సంద‌ర్భంగా అధికారులు మాట్లాడుతూ.. భాద్‌కియా గ్రామ అడవుల్లో పెద్ద ఎత్తున‌ జూదం ఆడుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. దీంతో అడవిలో ఉన్న రెండు బృందాల‌తో పాటు మరో రెండు జ‌ట్లు పోలీస్ స్టేషన్ నుంచి వ‌చ్చి ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయ‌ని తెలిపారు. ఈ రైడ్‌లో 40 మంది జూదగాళ్ళను, రూ.3.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

అంతేకాకుండా.. 40 మొబైల్ ఫోన్లను, 5 సెట్ల కార్డ్స్‌ను, 5కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును సంబంధిత సెక్షన్‌లలో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచార‌ణ‌లో మోను శివ్‌హరే, గోవింద్ ఖాటిక్‌లు ఈ జూదాలను నిర్వ‌హిస్తున్నార‌ని తేలింది. బాగ్లిలో నివాసం ఉండే వారు తెల్లవారు జాము 3 గంటల వరకు ఫోన్ టార్చ్ వెలుతురులో జూదం నిర్వహించినట్లు పోలీసులు వెల్ల‌డించారు.


Next Story