ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనలు
3.8 Magnitude earthquake hits Uttarakhand's Pithoragarh.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్లో
By తోట వంశీ కుమార్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం ఆదివారం ఉదయం 8:58 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. పితోర్గఢ్కు వాయువ్యంగా 23 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
భూకంపం తీవ్రత పెద్దగా లేకపోయినా భూకంపం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. నిజానికి, ఉత్తరాఖండ్లోని జోషిమత్లో గత రోజుల నుండి భూమి పగుళ్లతో కూడిన సంఘటనల మధ్య ఉత్తరాఖండ్ ప్రజలు మునుపటి కంటే అప్రమత్తంగా ఉన్నారు.
Earthquake of Magnitude:3.8, Occurred on 22-01-2023, 08:58:31 IST, Lat: 29.78 & Long: 80.13, Depth: 10 Km ,Location: 23km NNW of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/mKY2l8USLk pic.twitter.com/hyMFxU2IbT
— National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2023
జోషిమత్ విషాదం తర్వాత, ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల నుండి భయానక చిత్రాలు తెరపైకి వచ్చాయి. జోషిమఠ్ మాత్రమే కాదు ఉత్తరాఖండ్లోని వివిధ ప్రాంతాల్లో పగుళ్లు కనిపించాయి. రిషికేశ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, నైనిటాల్, ఉత్తరకాశీకి దూరంగా కొన్ని చోట్ల పెద్ద పగుళ్లు వచ్చాయి.
జనవరి 12న తెల్లవారుజామున 2:12 గంటలకు ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 2.9గా నమోదైంది. డిసెంబర్లో కూడా అర్థరాత్రి భూకంపం సంభవించింది. డిసెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.