'ఆపరేషన్ మహాదేవ్‌'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి

ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.

By Knakam Karthik
Published on : 28 July 2025 2:01 PM IST

National News, Jammukashmir, Indian Army, Operation Mahadev, Pahalgam terrorists,

'ఆపరేషన్ మహాదేవ్‌'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ దాడి జరిగి మూడు నెలల తర్వాత, ఈ మారణహోమం వెనుక ఉన్న ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుండి అనేక గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్‌లోని లిద్వాస్ జనరల్ ఏరియాలోని మౌంట్ మహాదేవ్ సమీపంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు సాయుధ దళాలకు సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ జరిగింది.

ఆపరేషన్ మహాదేవ్ అనే ఉమ్మడి విన్యాసాన్ని సైన్యం, జమ్మూ & కశ్మీర్ పోలీసులు మరియు CRPF ప్రారంభించాయి. కొద్దిసేపు కాల్పులు జరిగిన తరువాత, భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను పట్టుకుని వారిని మట్టుబెట్టారు.రెండు రోజుల క్రితం దచిగామ్ అడవిలో ఆర్మీ అనుమానాస్పద సమాచార మార్పిడిని ట్రాక్ చేసిందని, ఆ తర్వాత ఆపరేషన్ ప్రారంభించామని వర్గాలు తెలిపాయి.

అయితే, ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఓవైపు పార్లమెంట్ లో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ జరుగుతుండగా జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరగడం, అదికూడా పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.'

Next Story