చైనా నుంచి 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న పాక్.. భారత్ ఆందోళన చెందుతుందా.?
చైనాకు చెందిన కొత్త 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35లను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది.
By Medi Samrat
చైనాకు చెందిన కొత్త 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35లను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి పాక్ మొదటి విడత జెట్లను పొందనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. J-35 అనేది చైనాకు చెందిన అత్యంత అధునాతన యుద్ధ విమానం. దీనిని అమెరికాకు చెందిన F-35తో పోల్చుతారు.
పాకిస్థాన్కు ఇప్పటికే 20 చైనా జే-10సీ, జేఎఫ్-17 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు అది చైనా నుండి 40 J-35 కొనుగోలు చేస్తే.. అది స్టీల్త్ ఫైటర్ జెట్ల ఎలైట్ క్లబ్లో భాగం అవుతుంది. భారత్ వద్ద ఇంకా ఎలాంటి స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లేదు. అందువల్ల దక్షిణాసియాలో వాయు శక్తి సమతుల్యత దెబ్బతింటుంది.
J-35 అనేది ట్విన్-ఇంజిన్, సింగిల్-సీటర్ సూపర్సోనిక్ జెట్.. మల్టీరోల్ మిషన్ల కోసం ఉపయోగించబడుతుంది. క్రియాశీల ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే, ఎలక్ట్రో-ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్-అండ్-ట్రాక్తో సహా ఇది అధునాతన ఏవియానిక్స్ను కలిగి ఉంది. చైనా ప్రభుత్వ మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. ఇది స్టెల్త్, కౌంటర్-స్టెల్త్ కంబాట్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తుందని వివరించింది. ఇది ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది.
చైనా నవంబర్ 2024లో J-35ని ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉండగా.. ఒకటి నావికాదళం,మరొకటి భూ-ఆధారిత కార్యకలాపాల కోసం విడుదల చేయబడ్డాయి.
మాజీ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ అజయ్ అహ్లావత్ న్యూస్ వెబ్సైట్ NDTVతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ J-35 వేరియంట్ను కలిగి ఉండటం భారత్కు ఆందోళనను పెంచుతుందని అన్నారు. 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రస్తుతం భారతదేశంలో అభివృద్ధిలో ఉంది. ఇది 2035 కంటే ముందు ప్రయాణించే అవకాశం లేదు. భారత్ F-35 లేదా Su-57ని కొనుగోలు చేయాలని భావిస్తోంది.. అయితే AMCA కంటే మెరుగైనది ఏమీ లేదన్నారు.