ప్రపంచం ముందు మొసలి కన్నీరు కార్చేందుకు కూడా భార‌త్‌నే కాపీ కొట్టిన పాక్‌..!

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సంబంధించిన నిజాలను భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది.

By Medi Samrat
Published on : 2 Jun 2025 9:03 PM IST

ప్రపంచం ముందు మొసలి కన్నీరు కార్చేందుకు కూడా భార‌త్‌నే కాపీ కొట్టిన పాక్‌..!

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సంబంధించిన నిజాలను భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను 33 దేశాలకు పంపాలని భారత్ నిర్ణయించింది. ఇప్పుడు భారత్‌ను కాపీ కొట్టాలని పాకిస్థాన్ నిర్ణయించుకుంది.

పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచం ముందు బట్టబయలైన పాకిస్థాన్.. సోమవారం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు తన ప్రతినిధి బృందాన్ని పంపింది. పాకిస్థాన్ ఈ దేశాలకు వెళ్లి భారత సైన్యం తమ ఎయిర్ బేస్ లను, సైనిక స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో ఫిర్యాదు చేస్తుంది. ప్రపంచం ముందు మొసలి కన్నీరు కారుస్తూ సానుభూతి పొందడమే పాకిస్థాన్ లక్ష్యం.

ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకు ఉన్నతస్థాయి బహుళ-పార్టీ ప్రతినిధి బృందం సోమవారం నుంచి న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, బ్రస్సెల్స్‌లో పర్యటిస్తుందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.

తొమ్మిది మంది సభ్యుల బృందంలో ఫెడరల్ మంత్రి ముస్సాదిక్ మాలిక్, మాజీ విదేశాంగ మంత్రులు హీనా రబ్బానీ ఖార్, ఖుర్రం దస్తగిర్ ఖాన్, మాజీ మంత్రులు సయ్యద్ ఫైసల్ అలీ సబ్జ్వారీ, షెర్రీ రెహ్మాన్, సెనేటర్ బుష్రా అంజుమ్ బట్ ఉన్నారు. ఈ ప్రతినిధి బృందంలో మాజీ విదేశాంగ కార్యదర్శులు- జలీల్ అబ్బాస్ జిలానీ, తెహ్మినా జంజువా కూడా ఉన్నారు.

33 దేశాలను సందర్శించడం ద్వారా భారత్‌ పాకిస్తాన్‌ను బట్టబయలు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఉగ్రవాద దాడి జరిగితే.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనే సందేశాన్ని కూడా ఇచ్చింది. అదే సమయంలో పహల్గామ్ దాడిపై పలు దేశాలు పాకిస్థాన్‌ను తీవ్రంగా ఖండించాయి.

Next Story