మెక్సికోలో వరదల‌ బీభత్సం.. 41 మంది మృతి

భారీ వర్షాల కారణంగా మెక్సికో వరదలు బీభత్సం సృష్టించాయి.

By -  Medi Samrat
Published on : 12 Oct 2025 9:03 AM IST

మెక్సికోలో వరదల‌ బీభత్సం.. 41 మంది మృతి

భారీ వర్షాల కారణంగా మెక్సికో వరదలు బీభత్సం సృష్టించాయి. మెక్సికో వీధులు 12 అడుగుల వరకు నీటితో నిండిపోయాయి. అనేక నగరాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తులో కనీసం 41 మంది మరణించారు. చాలా మంది తప్పిపోయారు. మెక్సికోలోని పాజ్ రికాలో కాజోన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీజలాలు నగరాల్లోకి ప్రవేశించాయి. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది. చాలా కార్లు కొట్టుకుపోయాయి. భవనాలు కూలిపోయాయి. కార్లు చెట్లకు వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఓ పికప్ ట్రక్కులో గుర్రం మృతదేహం లభ్యమైంది.

భారీ వర్షాలు, వరదల కారణంగా మెక్సికోలోని అనేక ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మధ్య, దక్షిణ మెక్సికోలో 41 మరణాలు నిర్ధారించబడ్డాయి. అదే సమయంలో చాలా మంది అదృశ్యమయ్యారు. రోడ్లన్నీ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. అక్టోబరు 6-9 వరకు మెక్సికోలో వర్షం భారీ వినాశనాన్ని కలిగించింది. చమురుకు ప్రసిద్ధి చెందిన పోడ్ రికా నగరంలో వ‌ర్షం యొక్క‌ అత్యంత భయంకరమైన ప్రభావం కనిపించింది. మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి కేవలం 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాజ్ రికాలో బలమైన నీటి ప్రవాహంలో చాలా మంది కొట్టుకుపోయారు. వారి కోసం ఇంకా వెతుకుతున్నారు. హిడాల్గోలో శనివారం 16 మంది మరణించారు. అదే సమయంలో ప్యూబ్లాలో 9 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. 16,000 కంటే ఎక్కువ ఇళ్ళు శిధిలాలుగా మారాయి.

మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 42 ప్రాంతాలు రోడ్ల క‌నెక్టివిటీ తెగిపోయింది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్ వెతుకుతోంది. ఇక్కడ సుమారు 27 మంది తప్పిపోయారు, వారి జాడ ఇంకా కనుగొనబడలేదు.

Next Story