పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు

ఏప్రిల్ 12, శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు పాకిస్తాన్‌ను భూకంపం తాకిన తర్వాత భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.

By Medi Samrat
Published on : 12 April 2025 3:21 PM IST

పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు

ఏప్రిల్ 12, శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు పాకిస్తాన్‌ను భూకంపం తాకిన తర్వాత భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. అయితే ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శనివారం పాకిస్తాన్‌ను తాకిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో నమోదైంది. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లాలో భూకంపం కేంద్రం ఉందని తెలిపారు.

పాకిస్తాన్‌లో తరచుగా వివిధ తీవ్రతలతో కూడిన భూకంపాలు సంభవిస్తుంటాయి. 2005లో దేశంలో అత్యంత దారుణమైన భూకంపం సంభవించింది. ఆ సమయంలో 74,000 మందికి పైగా మరణించారు.

Next Story