తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ లాటరీకి ఓకుటుంబం బలైంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మిల్లుపురం సమీపంలోని సలామత్నగర్లో జరిగిన ఈ ఘటన విషాదంగా మారింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ స్వర్ణకార కుటుంబ ఆన్లైన్లో లాటరీలలోమోసపోయి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.