ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.!

Pre Teaser of Radhe Shyam. టాలీవుడ్ లో ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్

By Medi Samrat  Published on  6 Feb 2021 4:25 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.!
టాలీవుడ్ లో 'ఈశ్వర్' చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్ 'బాహుబలి' సీరీస్ తర్వాత జాతీయ స్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించే ప్రతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నారు. ఆ మద్య 'సాహెూ' పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో అపురూమమైన ప్రేమ కథాచిత్రంగా తెరకెక్కుతుంది 'రాధేశ్యామ్'.


ఈ మూవీ పూర్వ జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, పూజా హెగ్డే ప్రేర‌ణ అనే పాత్ర‌తో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌ల కాగా, ఇవి ఫ్యాన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ మూవీ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

అయితే వారికి తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇవాళ రాధేశ్యామ్‌ మూవీ నుంచి అప్డేట్‌ వచ్చేసింది. ప్రేమ‌కు విట్‌నెస్‌గా వాలంటైన్స్ డే ఉంటుంద‌ని తెలియ‌జేస్తూ ఆ రోజు మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కానున్న‌ట్టు హింట్ ఇచ్చారు. ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌ణ్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ కలిగిస్తున్నాయి. "మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం" అంటూ రెబల్‌స్టార్‌ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్‌ చేసింది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇట‌లీలోనే జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.



Next Story