పాఠశాలలు పునఃప్రారంభం 2022: తెలంగాణ నుండి జార్ఖండ్ వరకు.. పూర్తి వివరాలు మీ కోసం

Schools reopening in india 2022. కోవిడ్-19 కేసులు అదుపులోకి రాకపోవడంతో.. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ విద్యార్థుల భద్రత కోసం తమ విద్యా సంస్థలను మూసి

By అంజి  Published on  30 Jan 2022 7:57 AM GMT
పాఠశాలలు పునఃప్రారంభం 2022: తెలంగాణ నుండి జార్ఖండ్ వరకు.. పూర్తి వివరాలు మీ కోసం

కోవిడ్-19 కేసులు అదుపులోకి రాకపోవడంతో.. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ విద్యార్థుల భద్రత కోసం తమ విద్యా సంస్థలను మూసి ఉంచుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కోవిడ్-19 నిబంధనలను అనుసరించి తమ పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించుకున్నాయి. తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, రాజస్థాన్‌లలో పాఠశాలలు ఫిబ్రవరి 1 నుండి తిరిగి తెరవబడతాయి.

తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించగా.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. విద్యాసంస్థల్లో కోవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

జార్ఖండ్

జార్ఖండ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి 1 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. తుది నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ప్రతిపాదన పంపబడింది. జార్ఖండ్ పాఠశాలలను తిరిగి తెరవడం గురించి తుది ప్రకటన జనవరి 31, 2022న ప్రకటించబడుతుంది. జార్ఖండ్ విద్యా మంత్రి జగన్నాథ్ మహ్తో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ క్లాసులు అస్సలు విజయవంతం కాలేదు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ప్రభావితమవుతున్నారు. చాలా రాష్ట్రాలు పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. జార్ఖండ్‌లో కూడా పాఠశాలలను తిరిగి తెరవడానికి రాష్ట్రంలో సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.

పూణే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. పూణెలోని పాఠశాలలు ఫిబ్రవరి 1 నుండి తిరిగి తెరవబడతాయని ప్రకటించారు. 1 నుండి 8 తరగతుల విద్యార్థులు పూణె నగరం, జిల్లాలోని పాఠశాలలకు సాధారణ సమయాలలో సగం వరకు హాజరవుతారు. 9 నుండి 10 తరగతుల విద్యార్థులు సాధారణ సమయాలలో పాఠశాలకు హాజరవుతారు, పూణేలో కళాశాలలు కూడా సాధారణంగా పనిచేస్తాయి. కానీ విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరు కావాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం.

చండీగఢ్

అదే ట్రెండ్‌ని అనుసరించి, చండీగఢ్ పాఠశాలలు కూడా ఫిజికల్ క్లాసుల కోసం ఫిబ్రవరి 1 నుంచి తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు కూడా తిరిగి తెరవడానికి అనుమతించబడతాయి. "15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులందరూ ఆఫ్‌లైన్ తరగతులకు హాజరవుతున్నప్పుడు కనీసం 1వ డోస్‌కైనా టీకాలు వేయాలి" అని నోటిఫికేషన్ చెబుతోంది.

బెంగళూరు

బెంగళూరులోని పాఠశాలలు జనవరి 31 నుండి తిరిగి తెరవబడతాయి. అన్ని కోవిడ్-19 మార్గదర్శకాలతో తరగతులు నిర్వహించబడతాయి. జనవరి 27న, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ మాట్లాడుతూ.. బెంగుళూరు పాఠశాలలను ఎప్పుడు తిరిగి తెరవాలనే దానిపై క్యాబినెట్ అభిప్రాయాన్ని అడుగుతానని, కోవిడ్ -19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశం తర్వాత తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. జనవరి 29, పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

హర్యానా

హర్యానా ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి 10 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం తన పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. అయితే, ఆన్‌లైన్ తరగతులు కూడా షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయి. "ఫిబ్రవరి 1 నుండి 10, 11 మరియు 12 తరగతుల పాఠశాలలను తెరవాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది" అని హర్యానా విద్యా మంత్రి కన్వర్ పాల్ ట్వీట్ చేశారు.

త్రిపుర

త్రిపుర ప్రభుత్వం జనవరి 31, 2022 నుండి కఠినమైన కోవిడ్-19 పరిమితులతో తన పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించుకుంది. ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం పాఠశాలలు తిరిగి తెరవబడతాయి.

ఉత్తర ప్రదేశ్

ఇటీవల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ -19 ట్రెండ్‌ను చూసి ఫిబ్రవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 6 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన పాఠశాలలను పునఃప్రారంభించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి. యూపీ బోర్డు పరీక్షలకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story