రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

రాజస్థాన్‌లోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By -  Medi Samrat
Published on : 16 Feb 2026 12:41 PM IST

రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

రాజస్థాన్‌లోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప‌లువురు కార్మికులు సజీవ దహనం కాగా, ఇంకా చాలా మంది లోపల చిక్కుకున్నారు.

ఖుస్ఖేడా పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్ నంబర్ G1-118 వద్ద ఉన్న ఒక రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇందులో ఏడుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం ఫ్యాక్టరీ ప్రాంగణంలో గందరగోళానికి దారితీసింది. ఏడు మృతదేహాలను వెలికితీసేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించగా.. ఇద్దరు కార్మికులు ఇంకా లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సంఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 25 మంది కార్మికులు పనిచేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో చాలా మంది కార్మికులు తప్పించుకోలేకపోయారు. సంఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 25 మంది కార్మికులు పనిచేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో కార్మికులు వెంట‌నే తప్పించుకోలేకపోయారు.

భివాడి, ఖుష్ఖేడా మరియు పరిసర ప్రాంతాల నుండి అనేక అగ్నిమాపక యంత్రాలు గంటల తరబడి శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చాయి. కర్మాగారం భద్రతా ఏర్పాట్లపై దర్యాప్తుకు పరిపాలన యంత్రాంగం ఆదేశించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తును మోహరించారు.

Next Story