హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్కు వేధింపుల గురించి ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టు జరిగింది. పాఠశాల అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
24 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు తమను అనుచితంగా తాకాడని వారు ఆరోపించారు. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులను సమావేశానికి పిలిచారు. వారిలో చాలా మందికి తమ పిల్లలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియదని తేలింది. ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి అతనిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.