యువకుడు మృతి.. పోలీసులే కారణమంటున్న కుటుంబీకులు.. పోలీసులు ఏమంటున్నారంటే..
Family of 22-year-old alleges custodial torture behind man's death, police deny. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో 22 ఏళ్ల యువకుడు పోలీసుల చిత్రహింసల
By Medi Samrat Published on 27 Jun 2022 5:02 AM GMT
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో 22 ఏళ్ల యువకుడు పోలీసుల చిత్రహింసల వల్లే చనిపోయాడని అతని కుటుంబం ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. ఆ వ్యక్తి విషం సేవించాడని చెప్పారు. మృతుడి పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంది. అజిత్ అనే వ్యక్తి ఇరుగుపొరుగువారితో గొడవలకు దిగినందుకు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తర్వాత షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చాడు. జూన్ 23న, అజిత్ షరతులతో కూడిన బెయిల్ కోసం తన దినచర్యలో భాగంగా పోలీసు రిజిస్టర్పై సంతకం చేయడానికి కులశేఖరం పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అయితే అతడు ఇంటికి తిరిగి రాలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 23న అజిత్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ వ్యక్తి విషం తాగాడని, ప్లాస్టిక్ కవర్లోంచి ఏదో తీసి తిన్నాడని పోలీసులు తెలిపారు. దీంతో అంబులెన్స్కు ఫోన్ చేశారు.. అంబులెన్స్ వచ్చేలోపు ఆలస్యం కావడంతో ప్రైవేట్ జీపులో ఆసారిపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ బయట ఉన్న నిఘా కెమెరాలో రికార్డైంది.11 గంటలకు అజిత్ మృతి చెందాడు.
ఫోన్ తీసుకునేందుకు స్టేషన్కు వెళ్లినట్లు అజిత్ కుటుంబీకులు తెలిపారు. కులశేఖరం పోలీసులు తమ ఇంటికి వచ్చి కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించారని, అజిత్ తండ్రిని ఆసారిపాళ్యం ఆసుపత్రికి తీసుకెళ్లారని వారు ఆరోపించారు. "తమ కొడుకు విషం తాగాడని. తరువాత ఆసుపత్రిలో మరణించాడని పోలీసులు చెప్పారు" అని బాధితుడి బంధువులు తెలిపారు. తమ కుమారుడి మృతికి కులశేఖరం పోలీసులే కారణమని అజిత్ తండ్రి శశికుమార్ ఆరోపించారు.