ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్ ఫ్రీ టాయ్
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Oct 2020 2:49 PM ISTపిల్లలు మారం చేస్తున్నారు కదా అని తినడానికి ఏది కనిపిస్తే అది కొంటే ప్రాణాలమీదకే వస్తుంది. విజయనగరం జిల్లాలోని ఓ గిరిజన పల్లెలో అదే చోటు చేసుకుంది. చిప్స్తో పాటు బొమ్మ ఉచితంగా వస్తుంది కదా అని.. ఓ ప్యాకెట్ కొనిచ్చిన తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది. వారి పాప మృత్యువాత పడడంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు.
గరుగుబిల్లి మండలం, చిన్నగుడబ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలగ సంధ్య తన కుమార్తె మౌనిక కోసం క్రాక్స్ రింగ్ ప్యాకెట్ కొనిచ్చింది. పాప ఆ రింగ్స్ తింటూనే ప్యాకెట్లో గిఫ్ట్గా ఇచ్చిన చిన్న బొమ్మను కూడా మింగేసింది. ఆ బొమ్మ గొంతులో అడ్డుపడడంతో పాప ఊపిరి పీల్చుకోలేకపోయింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
Also Read
పరీక్ష రాసేందుకు వెళ్తూ మృత్యుఒడిలోకి..Next Story