కస్టమర్లకు అలర్ట్..ఇవాళ్టి నుంచి బ్యాంకులు బంద్..ఎన్ని రోజులంటే?

తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

By -  Knakam Karthik
Published on : 27 March 2026 6:57 AM IST

Business News, Telugu News, Andrapradesh, Telangana, Bank Holidays, SriRamaNavami

కస్టమర్లకు అలర్ట్..ఇవాళ్టి నుంచి బ్యాంకులు బంద్..ఎన్ని రోజులంటే?

తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. మార్చి 27వ తేదీ శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు సెలవు ప్రకటించింది.

దీనికి తోడు మార్చి 28న నాలుగో శనివారం, మార్చి 29న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. తిరిగి మార్చి 30వ తేదీ సోమవారం నాడు బ్యాంకులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సెలవుల కారణంగా చెక్ క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, లోన్ దరఖాస్తులు వంటి భౌతిక బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.

అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు యూపీఐ (UPI) వంటి డిజిటల్ లావాదేవీలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story