కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం
By సుభాష్ Published on 16 April 2020 11:55 AM GMTకేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా 'ఆరోగ్య సేతు' అనే యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పటి ఈ యాప్ను చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్లో కరోనా వైరస్ బాధితులు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారు. తదితర విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఈ యాప్ను ఈ-పాస్గా కూడా ఉపయోగించుకోవచ్చని ప్రధాని మోదీ సూత్రప్రాయంగా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ యాప్లో మరో రెండు ఫీచర్లను జోడించింది. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పాస్ (ఈ-పాస్). లాక్డౌన్ వేళ బయట తిరిగేందుకు కోవిడ్ లక్షణాలు, ఉత్పత్తి స్థానం బట్టి దీనిని రూపొందించారు. ఇందులో గ్రీన్, ఆరెంజ్ రంగులు ఉంటాయి.
ఆకు పచ్చరంగు వస్తే సదరు వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా తిరగవచ్చు. ఆరెంజ్ రంగు వస్తే ఆ వ్యక్తి ఎవరితోనూ కలవకూడదు. ఒక్క కార్యాలయం, ఇంటికి సంబంధించిన కార్యకలాపాల్లోనే పాల్గొనాల్సి ఉంటుంది. అంతేకాదు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక రెడ్ రంగు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరిని కలవకూడదు. పూర్తిగా గృహ నిర్భంధంలోనే ఉండాలి. ఇప్పటికే చైనాలో ఈ పద్దతిని విజయవంతంగా అనుసరించగా, ఇప్పుడు భారత్లో కూడా దీన్ని ప్రయత్నించనున్నారు.
ఇక మరో కొత్త ఫీచర్ కోవిడ్ ఆప్డేట్స్.. ప్రపంచం, దేశంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలు, ఏ ఆస్పత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి.. ఒక వేళ కరోనా వస్తే ఎవరిని ఎలా సంప్రదించాలి అని తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఈ ఫీచర్లు ఆపరేషనలైజ్ కాలేదు. మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.