జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం ఉండ‌దు.. అందుకే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా..

ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  24 Feb 2025 3:55 PM IST
జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం ఉండ‌దు.. అందుకే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా..

ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షంగా ఉండేది కేవలం వైఎస్సార్సీపీనే.. 11 సీట్లంటున్నారు కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా.? అని ప్ర‌శ్నించారు. న‌లుగురు ఎంపీలున్నారు.. 11 మంది ఎమ్మెల్యేలున్నారు.. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే.. ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు.

జగన్‌కు అందరు ఎమ్మెల్యేల మాదిరి మైక్‌ ఇస్తే రెండు నిమిషాల్లో ఏం చెప్పగలరు..? అదే ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే.. 40 నిమిషాలు ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది.. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు..

జగన్‌ను అవమానిస్తున్నాం అని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ.. ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారన్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లామ‌న్నారు. ప్రతిపక్షనేతగా జగన్ అసెంబ్లీకి వెళ్తే వాళ్లకు ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు అన్నారు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.. జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం ఉండ‌దు.. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారన్నారు.

నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చటవ‌స్తే.. కూటమి గాలిలోనే 65 వేల ఓట్లతో బీటెక్‌ రవి ఓడిపోయాడు.. వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే.. పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి.. ఎన్నికలకు వెళ్దాం.. ఈ 9 నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్‌ సిక్స్‌ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం.. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం.. కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు అని స‌వాల్ విసిరారు.

Next Story