పల్నాడు జిల్లాలో విషాదం..ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

By Knakam Karthik
Published on : 9 Feb 2025 8:04 PM IST

Crime News, Telugu News, AndraPradesh, Accident, Palnadu

పల్నాడు జిల్లాలో విషాదం..ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలువ కట్టపై ఈ ఘటన జరిగింది. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సత్తెనపల్లి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 25 మంది మహిళా కూలీలు ఉన్నట్లు గుర్తించారు.

Next Story