దాడికి బాధ్యులైన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి : పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు

By Medi Samrat
Published on : 28 Jun 2025 4:45 PM IST

దాడికి బాధ్యులైన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి : పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఒక ప్రకటన విడుదల చేశారు.

మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మార్గాలను అనుసరించకుండా, నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు. మహా న్యూస్ ఛానెల్‌పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Next Story