పోలవరం ఎత్తుపై పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల

పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 27 Jun 2025 1:28 PM IST

Andrapradesh, YS Sharmila, Congress, Ysrcp, Tdp, Janasena, Polavaram, Pm Modi

పోలవరం ఎత్తుపై పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల

దేశంలో గత పదకొండేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏలూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఆ ఎమర్జెన్సీతో పోల్చితే.. ఈ ఎమర్జెన్సీ ఎక్కువ. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. సహజ సంపదను దోచుకుతిన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టారు. మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా? ఇప్పటివరకు ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లలేదు. బీజేపీ రైటిస్ట్ పార్టీ, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. మంటలు పెట్టి చలి కాచుకుంటున్నారు. ఇది కాదా ఎమర్జెన్సీ? దేశ సంపదను అదానీ, అంబానీకి దోచిపెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం అన్ని మీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరినీ మాట్లాడనివ్వరు. మాట్లాడితే కేసులు పెడతారని భయం. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు.. అని షర్మిల వ్యాఖ్యానించారు.

టీడీపీ, జనసేన, వైసీపీ..మోదీకి తొత్తులుగా మారాయి

గత పదకొండేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి విభజన హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. విభజన హామీలు నెరవేరాలి అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసింది. పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చారు. దీనిని నీటి నిల్వ కోసం కట్టిన బ్యారేజ్‌గా మార్చారు. ఎత్తు 45 నుంచి 41కి తగ్గిస్తుంటే పార్లమెంట్‌లో ప్రశ్నించే ఒక్క మగాడు లేడు, ఒక్కరూ నోరు విప్పరు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలలో ఒక్కరికీ దమ్ము లేదు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.

Next Story