ఏపీలో కొత్త‌గా 9,742 కేసులు.. 86 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 11:14 AM GMT
ఏపీలో కొత్త‌గా 9,742 కేసులు.. 86 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటాయి. గడిచిన 24గంటల్లో 57,685 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,742 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,003కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో ప‌దిహేను మంది, నెల్లూరులో ప‌దిహేను మంది, అనంత‌పూర్‌లో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, ప్ర‌కాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పు‌గోదావ‌రిలో ఐదుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఐదుగురు, విజ‌య‌న‌గ‌రంలో ఐదుగురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఐదుగురు,క‌డ‌ప‌లో న‌లుగురు, కృష్ణాలో ముగ్గురు, క‌ర్నూల్‌లో ఇద్ద‌రు చొప్పున మొత్తం 86మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2,906కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,26,372 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 86,725 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1123,

చిత్తూరులో 830,

ఈస్ట్‌ గోదావరిలో 1399,

గుంటూరులో 555,

కడపలో 673,

కృష్ణలో 281,

కర్నూలులో 794,

నెల్లూరులో 755,

ప్రకాశంలో 585,

శ్రీకాకుంలో 565,

విశాఖపట్నంలో 835,

విజయనగరంలో 428,

పశ్చిమ గోదావరిలో 919 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story