తెలంగాణలో కొత్తగా 1763 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  19 Aug 2020 2:56 AM GMT
తెలంగాణలో కొత్తగా 1763 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1763 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 95,700కు చేరింది. ఇక మృతుల సంఖ్య ఇప్పటి వరకు 719 కు చేరింది. ఇక రాష్ట్రలో 20,660 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.75 శాతం ఉండగా, దేశంలో ఇది 1.92 ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. పాజిటివ్‌ కేసుల కంటే రికవరీ ఎక్కువగా ఉంది. తాజాగా రాష్ట్రంలో 1789 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం రికవరీ కేసుల సంఖ్య 73,991 చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా అధికంగా నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 484 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 169, రంగారెడ్డి జిల్లాలో 166, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 88 కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వంద లోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Ts Coroana

Next Story