ఏపీలో కొత్త‌గా 9,536 కేసులు.. 66 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 12:44 PM GMT
ఏపీలో కొత్త‌గా 9,536 కేసులు.. 66 మ‌ర‌ణాలు

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 72,233 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,536 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,67,123కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంత‌పూర్‌లో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, క‌డ‌ప‌లో ఆరుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావ‌రిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, క‌ర్నూలులో ఐదుగురు, గుంటూరులో న‌లుగురు, విజ‌య‌న‌గ‌రంలో న‌లుగురు, ప‌శ్చిమ గోదావ‌రిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్ద‌రు చొప్పున మొత్తం 66 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,912కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,67,139 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 95,072 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 521,

చిత్తూరులో 957,

ఈస్ట్‌ గోదావరిలో 1414,

గుంటూరులో 792,

కడపలో 585,

కృష్ణలో 397,

కర్నూలులో 441,

నెల్లూరులో 844,

ప్రకాశంలో 788,

శ్రీకాకుంలో 733,

విశాఖపట్నంలో 415,

విజయనగరంలో 573,

పశ్చిమ గోదావరి 1076 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story