తెలంగాణలో కొత్తగా మరో 945 పాజిటివ్ కేసులు
By న్యూస్మీటర్ తెలుగు
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3457 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 945 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 15394 కేసులు నమోదు కాగా, 260 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలో 869 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 29 కేసులు, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7294 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 8785 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1712 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 30.06.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/UTEg4cHjfJ
— Eatala Rajender (@Eatala_Rajender) June 30, 2020