ఏపీలో కొత్తగా 704 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2020 6:56 AM GMT
ఏపీలో కొత్తగా 704 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 18,114 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 704 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 648 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మంది.. 5గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14595కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 187కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6511 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 7897మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 104, చిత్తూరులో 107, ఈస్ట్‌ గోదావరిలో 55, గుంటూరులో 58, కడపలో 75, కృష్ణలో 84, కర్నూలులో 82, నెల్లూరులో 05, ప్రకాశంలో 31, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 26, విజయనగరంలో 13, పశ్చిమ గోదావరిలో 7 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Untitled 8 Copy

Next Story