ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2020 12:54 PM GMT
ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 74,595 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,218 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో తొమ్మిదిమంది, కృష్ణలో ఏడుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, క‌డ‌ప‌లో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో న‌లుగురు, ప్ర‌కాశంలో న‌లుగురు, విశాఖ‌ప‌ట్నంలో న‌లుగురు, తూర్పుగోదావ‌రిలో ముగ్గురు, క‌ర్నూల్‌లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజ‌య‌న‌గ‌రంలో ఒక్క‌రు చొప్పున మొత్తం 58 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,302కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,30,711 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 81,763 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 477,

చిత్తూరులో 736,

ఈస్ట్‌ గోదావరిలో 1395,

గుంటూరులో 471,

కడపలో 520,

కృష్ణలో 468,

కర్నూలులో 319,

నెల్లూరులో 693,

ప్రకాశంలో 670,

శ్రీకాకుంలో 485,

విశాఖపట్నంలో 451,

విజయనగరంలో 462,

పశ్చిమ గోదావరి 1071 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story