ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. ల‌క్ష‌కు చేరువ‌లో కేసులు

By Medi Samrat  Published on  26 July 2020 1:18 PM GMT
ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. ల‌క్ష‌కు చేరువ‌లో కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 47645 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7627 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 69298కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావ‌రి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ‌ప‌ట్నంలో ఎనిమిది మంది, క‌ర్నూల్‌లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప‌శ్చిమ గోదావ‌రిలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విజ‌య‌న‌గ‌రంలో ముగ్గురు, అనంత‌పురంలో ఇద్ద‌రు, క‌డ‌ప‌లో ఇద్ద‌రు, గుంటూరులో ఒక్క‌రు, ప్ర‌కాశంలో ఒక్కరు చొప్పున మొత్తం 56 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1041 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 46301 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 48956 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 734,

చిత్తూరులో 573,

ఈస్ట్‌ గోదావరిలో 1095,

గుంటూరులో 547,

కడపలో 396,

కృష్ణలో 332,

కర్నూలులో 1213,

నెల్లూరులో 329,

ప్రకాశంలో 242,

శ్రీకాకుంలో 276,

విశాఖపట్నంలో 784,

విజయనగరంలో 247,

పశ్చిమ గోదావరిలో 859 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story