ఏపీలో కొత్తగా 6,923 కేసులు.. 45 మరణాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Sept 2020 6:34 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 76,416 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,923 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,687,51కి చేరింది.
కొవిడ్ వల్ల ప్రకాశంలో ఎనిమిది మంది, కృష్ణలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, తూర్పగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, అనంతపూర్లో ముగ్గురు, కడపలో ముగ్గురు, కర్నూల్లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,708కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,05,090 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 64,876 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 480,
చిత్తూరులో 577,
ఈస్ట్ గోదావరిలో 1006,
గుంటూరులో 535,
కడపలో 472,
కృష్ణలో 333,
కర్నూలులో 229,
నెల్లూరులో 506,
ప్రకాశంలో 659,
శ్రీకాకుంలో 503,
విశాఖపట్నంలో 318,
విజయనగరంలో 376,
పశ్చిమ గోదావరి 929 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.