ఏపీలో కొత్త‌గా 5,210 కేసులు.. 30 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 12:16 PM GMT
ఏపీలో కొత్త‌గా 5,210 కేసులు.. 30 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75,517 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,210 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,55,727కి చేరింది.

కొవిడ్‌ వల్ల ప్ర‌కాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో న‌లుగురు, తూర్పు‌గోదావ‌రిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, క‌డ‌ప‌లో ముగ్గురు, విశాఖ‌ప‌ట్నంలో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఇద్ద‌రు, శ్రీకాకుళంలో ఒక్క‌రు, ప‌శ్చిమ‌‌గోదావరిలో ఒక్క‌రు చొప్పున 30 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6,224కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7,03,208 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 46,295 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 311,

చిత్తూరులో 713,

ఈస్ట్‌ గోదావరిలో 701,

గుంటూరులో 431,

కడపలో 418,

కృష్ణలో 462,

కర్నూలులో 175,

నెల్లూరులో 288,

ప్రకాశంలో 362,

శ్రీకాకుళంలో 212,

విశాఖపట్నంలో 190,

విజయనగరంలో 161,

పశ్చిమ గోదావరి 786 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story