ఏపీలో కొత్తగా 5,145 కేసులు.. 31 మరణాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Oct 2020 7:04 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 70,521 శాంపిల్స్ను పరీక్షించగా.. 5,145 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 7,44,864కి చేరింది.
కొవిడ్ వల్ల ప్రకాశంలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపూర్లో ముగ్గురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు, కర్నూల్లో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో చొప్పున 31 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6,159కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,91,040 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 47,665 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 285,
చిత్తూరులో 757,
ఈస్ట్ గోదావరిలో 738,
గుంటూరులో 342,
కడపలో 352,
కృష్ణలో 310,
కర్నూలులో 211,
నెల్లూరులో 310,
ప్రకాశంలో 486,
శ్రీకాకుళంలో 139,
విశాఖపట్నంలో 159,
విజయనగరంలో 194,
పశ్చిమ గోదావరి 862 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.