ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 5:47 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 84,534 శాంపిల్స్ను పరీక్షించగా.. 2,849 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,30,731కి చేరింది.
కొవిడ్ వల్ల కృష్ణలో ముగ్గురు, అనంతపూర్లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున 15 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,734కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8,02,325 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 21,672 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read
తెలంగాణలో 2,23,413 పాజిటివ్ కేసులుNext Story