తెలంగాణ‌లో మ‌హ‌మ్మారి ధాటికి మ‌రో 10మంది బ‌లి.. కొత్త‌గా 1524 కేసులు

By Medi Samrat  Published on  14 July 2020 4:57 PM GMT
తెలంగాణ‌లో మ‌హ‌మ్మారి ధాటికి మ‌రో 10మంది బ‌లి.. కొత్త‌గా 1524 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13,175 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1524 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ప‌దిమంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 37,745 కేసులు నమోదు కాగా, 375 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 815 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 240 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 97 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 30 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 29 కేసులు, మెద‌క్‌‌ జిల్లాలో 24 కేసులు, మంచిర్యాల‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాల‌లో త‌లా 12 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 38 కేసులు , కామారెడ్డి జిల్లాలో 19 కేసులు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 19 కేసులు, వికారాబాద్ జిల్లాలో 21 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 17 కేసులు, సూర్యాపేట జిల్లాలో 15 కేసులు, గ‌ద్వాల్ జిల్లాలో 13 కేసులు చొప్పున‌ నమోదయ్యాయి. గ‌త నెల‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 24840 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 12531 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1161 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story