భారత్‌లో 24 గంటల్లో 28,498కేసులు.. 553 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 5:05 AM GMT
భారత్‌లో 24 గంటల్లో 28,498కేసులు.. 553 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 553 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,06,752కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 28,498 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 5,71,460 కోలుకుని డిశ్చార్జి కాగా.. 3,11,565 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.02శాతం ఉండగా.. మృతుల రేటు 2.64శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,20,92,503 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,86,247 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 3వ స్థానంలో ఉంది. 34.7లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 18.8లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది.

Next Story