ఏపీలో మరణమృదంగం.. 24గంటల్లో 43 మంది మృతి.. 1916 కేసులు నమోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 8:31 AM GMT
ఏపీలో మరణమృదంగం.. 24గంటల్లో 43 మంది మృతి.. 1916 కేసులు నమోదు.

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం వందల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1916 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1908 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33019కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంత‌పురంలో పది మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 43 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 408 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 17467 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 15144 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 185,

చిత్తూరులో 238,

ఈస్ట్‌ గోదావరిలో 160,

గుంటూరులో 146,

కడపలో 112,

కృష్ణలో 129,

కర్నూలులో 169,

నెల్లూరులో 165,

ప్రకాశంలో 32,

శ్రీకాకుంలో 215,

విశాఖపట్నంలో 28,

విజయనగరంలో 130,

పశ్చిమ గోదావరిలో 199 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story