ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ ఎందుకు రాశారు..? ఆ లేఖలో ఏముందీ..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 11:04 AM GMT
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ ఎందుకు రాశారు..? ఆ లేఖలో ఏముందీ..?

అమరావతి: ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌కు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని ప్రధానికి వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల సామర్ధ్యం 5010 మెగావాట్లు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ నుంచే సరఫరా అయ్యేది. కానీ..రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్‌ కాలరీస్‌ను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. దీంతో 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఈ పరిస్థితి తీవ్ర అంతరాయం మారింది. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. ప్రతీ గని నుంచి 5ఎంఎంటీఏలు ఏపీ తీసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణా వ్యయం చాలా అధికంగా ఉందని తెలిపారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల చట్టం:

2015 ప్రకారం 'ట్రాంచీ 6' ను ఏపిజెన్‌కో వినియోగం కోసం ఏపీకి కేటాయించారు. పై అంశాన్ని పరిగణలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వశాఖకు ఏపీజెన్‌కో దరఖాస్తు చేసుకుంది. మార్చి 2020 నాటికి ఏపీ జెన్‌కో తన థర్మల్‌ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఈ అదనపు విద్యుత్‌ తయారీ కోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉంది. అంతేకాక ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉంది. మందానికి 'ఎ' కోల్‌ బ్లాక్, తాల్చేరు కోల్‌ఫీల్డ్, అంగుల్‌ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మందాకిని కోల్ బ్లాక్ ను ఏపీజెన్ కోకు కేటాయించాలని కోరుతున్నాం. కేంద్ర బొగ్గుశాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు.

Next Story