ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 30, 2025
గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జయశంకర్, సిద్దిపేట, వరంగల్, ములుగు, జనగాం, ఖమ్మం, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతాజిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి,విశాఖ, అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతాజిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.~ ఏపీ విపత్తుల సంస్థ pic.twitter.com/urQphf5E5O
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 30, 2025