తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎం) తెలిపింది.

By అంజి
Published on : 7 Sept 2025 6:58 AM IST

Rain alert, Telugu states,  Rains , Telangana, Andhrapradesh

తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎం) తెలిపింది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అటు తెలంగాణలో కూడా నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సిద్ధిపేట, వరంగల్‌ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది.

Next Story