తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 41 నుంచి 61 కి. మీ. ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భార్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జిల్లాల్లో రాగల రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం తర్వాత కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.